సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ – చండూరు
మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. గురువారం చండూరు మండల కేంద్రంలో హమాలి వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ కార్మిక సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మేడేను చండూరు మండల కేంద్రంలో, నేర్మట గ్రామంలోఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలోప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యాం కొరకు పోరాడుదాం అని, కార్మిక కర్షక హక్కులకై నిరంతరం కృషి చేయాలని ఆయన అన్నారు. అమెరికా నగరం చికాగో పట్టణంలో లక్షలాదిమంది కార్మికులు 12 గంటల పని విధానం రద్దుయ్యే వరకు పోరాడి వేలది మంది కార్మికులు ఆత్మబలిదానం చేసిన రోజు మే 1 మే డే దినోత్సవం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచడం కార్మికుల చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్ల్ ద్వారా కార్మికులను అణిచివేసే కుట్రలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో కార్మిక కర్షక రాజ్యం ఆవిర్భావం తప్పక జరుగుతుందని అన్నారు. సిఐటియు, సీపీఐ(ఎం) నిరంతరం కర్మిక ప్రజా సమస్యలపై పోరాటాల నిర్వహిస్తుందని భూమి బుక్తీ విముక్తికై సాగిన తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని ఆయన తెలియజేశారు. హమాలి అసంఘటితరంగా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆశ అంగన్వాడి స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని గ్రామపంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని అన్నారు. విఓఎ మధ్యాహ్న భోజనం కార్మికులు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలపై రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిఐటియు సీనియర్ నాయకులు మొగుధాల వెంకటేశం, చిట్టి మల్ల లింగయ్య, రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు సాయం కృష్ణయ్య, నాగరాజు, చిరంజీవి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కత్తుల సైదులు, నల్ల గంటి లింగస్వామి, బిపంగి నాగరాజు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు నాంపల్లి శంకర్, బెరే బిక్షమయ్య, నగేష్, కృష్ణయ్య, వెంకట చారి, పుష్పలత, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
20న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -
RELATED ARTICLES