Friday, May 2, 2025
Homeబీజినెస్ ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’  పోటీని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

 ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’  పోటీని ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా

·       2025 ఎడిషన్ టాప్ 4 విజేత జట్లకు ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. వారికి రూ.1 కోటి గ్రాంట్ లభిస్తుంది. అదనంగా, టాప్ 20  జట్లకు రూ.20 లక్షలు, టాప్ 40 జట్లకు రూ.8  లక్షలు అందజేయబడతాయి.
·       ఈ సంవత్సరం, రెండు ప్రపంచ ఇతివృత్తాలు – విద్య కోసం క్రీడలు, సాంకేతికత ద్వారా సామాజిక మార్పు, మెరుగైన భవిష్యత్తులు మరియు సాంకేతికత ద్వారా పర్యావరణ స్థిరత్వం-ప్రవేశ పెట్ట బడ్డాయి, ఇవి స్థానిక, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి విద్యార్థులను శక్తివంతం చేస్తాయి.
·       ఈ కార్యక్రమం విద్యార్థులకు ఆచరణాత్మక నమూనా తయారీతో పాటు 82,000గంటల శిక్షణ,  మార్గదర్శకత్వ మద్దతును అందిస్తుంది, దీని ద్వారా పాల్గొనేవారికి సాధికారత లభిస్తుంది.
·        ఈ కార్యక్రమం 14-22 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది.  ఆరు నెలల పాటు కొనసాగుతుంది, దరఖాస్తులు 2025 ఏప్రిల్ 29  నుండి జూన్ 30 వరకు స్వీకరించబడతాయి.

నవతెలంగాణ  గురుగ్రామ్ : భారతదేశ అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్ తన సామ్‌సంగ్ ‘సాల్వ్ ఫర్ టుమారో’ కార్యక్రమం నాల్గవ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇది సాంకే తికతను ఉపయోగించుకోవడం ద్వారా సమాజంలోని కొన్ని ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించడానికి విద్యా ర్థులను వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ప్రేరేపించడానికి రూపొందించబడిన దేశవ్యాప్త పోటీ. సామ్‌సంగ్ ‘సాల్వ్ ఫర్ టుమారో 2025’ మొదటి నాలుగు విజేత జట్లకు వారి ప్రాజెక్టుల ఇంక్యుబేషన్‌కు మద్దతు ఇవ్వడానికి  రూ.1 కోటి అందిస్తుంది. అలాగే సామ్‌సంగ్ ఉన్నతాధికారులు, ఐఐటీ దిల్లీ అధ్యాపకుల నుండి ఆచరణాత్మక నమూనా తయారీలో మద్దతు, ఇన్వెస్టర్ల సంబంధాలు, నిపుణుల మార్గదర్శకత్వం లభిస్తాయి. ఈ విధమైన గుర్తింపు అనేది పోటీలో రాణించడమే కాకుండా సమస్యలను అధిగమించే పరిష్కారాలను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను చాటిచెబుతుంది. అంతిమంగా భారతదేశం అంతటా కమ్యూనిటీ లను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే ఉన్నతస్థాయి, సుస్థిర  వెంచర్‌లుగా అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పాటు కొనసాగే ఈ కార్యక్రమం, 14-22 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులను వ్యక్తులు లేదా సమూహాలుగా వారి సాంకేతిక ఆలోచనలను సమర్పించాల్సిందిగా ఆహ్వానిస్తోంది. ఈ సంవత్సరం, పాల్గొనేవారు నాలుగు కీలక ఇతివృత్తాలలో పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుంది.  సురక్షితమైన, తెలివైన, సమగ్ర భారత్ కోసం ఏఐ; భారతదేశంలో ఆరోగ్యం, పరిశుభ్రత, శ్రేయస్సు యొక్క భవిష్యత్తు; విద్య,  మెరుగైన భవిష్యత్తు కోసం క్రీడలు, సాంకేతికత ద్వారా సామాజిక మార్పు; సాంకేతికత ద్వారా పర్యావరణ సుస్థిరత్వం.
ఈ సందర్భంగా సామ్‌సంగ్ సౌత్‌వెస్ట్ ఆసియా ప్రెసిడెంట్, సీఈఓ  జెబి పార్క్ మాట్లాడుతూ, “సోల్వ్ ఫర్ టు మారోతో, భారతదేశంలోని ప్రతి మూలలోని యువ ఆవిష్కర్తలు పెద్ద కలలు కనేలా, వాస్తవ ప్రపంచ సవా ళ్లను ఎదుర్కోవడానికి, సాంకేతికత ద్వారా తెలివైన, మరింత సమ్మిళిత భవిష్యత్తును రూపొందించడానికి మేం స్ఫూర్తినిస్తున్నాం. ఈ సంవత్సరం, సాల్వ్ ఫర్ టుమారో మరింత పెద్దదిగా, మరింత సమ్మిళితంగా ఉండబోతోంది. మేం మరిన్ని నగరాలను చేరుకుంటున్నాం, మరిన్ని పాఠశాలలు, కళాశాలల నుండి విద్యా ర్థులను ఇందులో భాగస్వాములుగా  చేస్తున్నాం. డిజైన్ ఆలోచన సూత్రాలను వర్తింపజేస్తూ వారు ఆవిష్క రణలు చేయడానికి మార్గాలను సృష్టిస్తున్నాం. సాల్వ్ ఫర్ టుమారో భారత ప్రభుత్వం మార్గదర్శక #డిజిటల్ ఇండియా చొరవ పట్ల మా అచంచలమైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మన యువత భవి ష్యత్తు  రూపకర్తలుగా మారడానికి శక్తినిస్తుంది’’ అని అన్నారు.
“ఐఐటీ దిల్లీ యువతలో ఆవిష్కరణ, వ్యవస్థాపకత, వాస్తవ ప్రపంచ సమస్య పరిష్కారాన్ని పెంపొందించడం పట్ల ఉత్సాహంగా ఉంది. సామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారోతో మేం కలసి పని చేయడం యువత తమ ఆలోచనలను సమాజాన్ని ప్రభావితం చేసే ఉత్పత్తులుగా మార్చడంలో సహాయపడటానికి మార్గదర్శకత్వం, పరిశోధన మౌలిక సదుపాయాలు, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. సామాజికంగా స్పృహతో కూడిన ఆవిష్కరణలను ప్రారంభించి, వికసిత్ భారత్‌కు దోహదపడే ఈ కార్యక్రమంలో భాగం కావడం మాకు సంతోషంగా ఉంది” అని ఐఐటీ దిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగన్ బెనర్జీ అన్నారు.  ‘‘2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో, 2047 నాటికి  వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడంలో భారతదేశ యువ ఆవిష్కర్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే దేశం కంటే ఎక్కువ గా మంది యువతతో పరిష్కారాలను అన్వయించుకోవడానికి, ప్రపంచమార్పును ప్రేరేపించే ఆలోచనలతో నాయకత్వం వహించడానికి భారతదేశం ప్రత్యేక స్థానంలో ఉంది. సామ్‌సంగ్ సాల్వ్ ఫర్ టుమారో వంటి కార్యక్రమాలు యువత తమ ఆలోచనలను ప్రపంచ మంచి కోసం పరిష్కారాలుగా మార్చడానికి, సమగ్ర మరియు సుస్థిరమైన పురోగతిని నడిపించడానికి సాంకేతికతను ఉపయోగించడానికి కీలకమైన వేదికను అందిస్తాయి., ఇక్కడి యువత నాయకత్వం, వినూత్నత, కార్యాచరణను పెంపొందించే, ముఖ్యంగా ప్రైవేట్ రంగంతో సహకారాలకు మద్దతు ఇవ్వడం పట్ల భారతదేశంలో ఐరాస గర్వంగా ఉంది, ఇది  అభివృద్ధిలో మనం ఎవరినీ వదిలిపెట్టకుండా చూస్తుంది, ”అని భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ సమన్వయ కర్త షోంబి షార్ప్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img