– రూ.3 కోట్ల 54 లక్షల,52 వేల ఉపాధి నిధులు వ్యయం
– మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గ వ్యాప్తంగా 2025 – 2026 ఆర్ధిక సంవత్సరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మౌళిక సదుపాయాల కల్పన లో భాగంగా రూ.3 కోట్ల 54 లక్షల,52 వేల ఉపాధి నిధులు వ్యయంతో గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టనున్న పనుల జాతరను శుక్రవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ లాంచనంగా ప్రారంభించనున్నారు. ఇందులో సీసీ రోడ్లు, పశువుల పాకలు, కాంపౌండ్ వాల్, బోర్ వెల్స్, ప్లాంటేషన్, మేజిక్ సోక్ పిట్ లాంటి పనులు చేపడతారు.
చండ్రుగొండ మండలం లో మూడు పంచాయితీల్లో రూ.47 లక్షల 50 వేలు,
అన్నపురెడ్డిపల్లి మండలం లో 7 పంచాయితీల్లో రూ.1 కోటి 14 లక్షల 50 వేలు,
ములకలపల్లి మండలం లో 7 పంచాయితీల్లో రూ. 74 లక్షల 95 వేలు,
అశ్వారావుపేట మండలం లో 10 పంచాయితీల్లో రూ.56 లక్షల 18 వేలు,
దమ్మపేట మండలం లో 6 పంచాయితీల్లో రూ.61 లక్షల 38 వేలు నిధులతో చేపట్టిన,
చేపట్టనున్న పనులకు ఆయన ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయనున్నారు.
అశ్వారావుపేట మండలంలో మధ్యాహ్నం 1.30 కు రెడ్డిగూడెం,1.40 కి తిరుమలకుంట,2.00 కు కొత్త మామిళ్ళవారిగూడెం, 2.15 కు ఆసుపాక,2.30 కు వినాయకపురం, సా 3.00 : ఊట్లపల్లి సాయంత్రం 3.15 కు వాగొడ్డుగూడెం,3.30 కు కేశప్పగూడెం,3.50 జమ్మిగూడెం,4.10 అచ్యుతాపురం లో పర్యటించనున్నారు.