- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించారు. వివిధ కారణాలతో పేరెంట్స్ ను కోల్పోయిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి 3 వేల చొప్పున నగదు ఆర్థిక సహాయం అందించారు. బ్యాంక్ లో ఫిక్స్ డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ ని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే సొసైటీ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో భాగంగా పెండింగ్ లో ఉన్న 19 మంది ఈ సహాయం అందించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, శేఖర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గంగా రెడ్డి రాజు, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ జర్నలిస్టులు పాల్గొన్నారు.
- Advertisement -