నవతెలంగాణ – పెద్దవూర
పొలాల అమావాస్య దినోత్సవం సందర్బంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్నా శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరిలో అమావాస్య రోజున జరుపుకునే పండుగ. దీనిని బైల్ పోలా లేదా ఎడ్ల పండుగ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా రైతులు తమ పశువులను పూజిస్తూ.. వాటికి సన్మానం చేస్తూ ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. ఈ సంవత్సరం (2025) ఆగస్టు 23వ తేదీన పొలాల అమావాస్యదినోత్సవ పండుగ వచ్చింది. రైతులకు ఈ పండుగ అత్యంత ముఖ్యమైనది.సాగులో తోడుగా ఉండే మూగజీవాలైన ఎద్దులను రైతులు పూజించి, వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. పశువులను పూల దండలతో, గజ్జెలు, కొత్త ధనంగా అలంకరిస్తారు.ఎడ్లతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఈ ఏడాది రైతులకు పంటలుబాగా పండాలని రైతులందరు ధన దాన్యాలతో తుల తుగాలని ఆయన అకాంక్షించారు.
ప్రజలకు పొలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు: బుసిరెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES