- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఖైరతాబాద్ బడా గణేశ్ క్యూ లైన్లో వద్ద మహిళకు పురిటినోప్పులు వచ్చాయి. అమె (రేష్మ) అక్కడ బెలూన్లు, ఇతర ఆట వస్తువులు విక్రయిస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న అమెను కుటుంబసభ్యులు, స్థానికులు గమనించి గణేశ్ మండపం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకేళ్లారు. స్ట్రెచర్ సిద్ధం చేస్తుండగా ఆస్పత్రి సెల్లార్లోనే ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ,బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
- Advertisement -