Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి..

త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి..

- Advertisement -

ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను రికార్డులలో నమోదు చేపించాలి..
ప్రజావాణి దరఖాస్తులు త్వరగతిన పరిష్కరించాలి..
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.. 
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో జరిగిన ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వెబ్ పోర్టల్ నందు శాఖల వారీగా డిపార్ట్మెంట్ ప్రొఫైల్, జిల్లా స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్,వార్షిక నివేదిక,శాఖ ల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారులు వివరాలు అప్డేట్ చేయాలని తెలిపారు.మండల ప్రత్యేక అధికారులు ఎంపిడిఓ లతో, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులతో, పంచాయతీ కార్యదర్సులతో ప్రతి వారం సమీక్ష నిర్వవించి, వేసవి లో త్రాగునీటి సమస్య లేకుండా ప్రటి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలనీ అన్నారు.
ఎక్కడైనా త్రాగునీటి సమస్య ఉందని ప్రజలు ఫోన్ చేసిన వెంటనే స్పందించి ఆ సమస్య ను పరిష్కరించాలని తెలిపారు. రెవిన్యూ సదస్సులు జరుగుతున్నందున ఆ గ్రామాలలో పంచాయతీ, పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టల్స్,హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హల్ లకి సంబందించిన భూముల వివరాలను రికార్డులలో తప్పని సరిగ్గా నమోదు చేయాలని అన్ని శాఖల అధికారులకి సూచించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కాపాడుకోవాలని తెలిపారు. తదుపరి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణి లకి సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను శాఖ ల వారీగా వివరించారు. ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా, ఆర్జిదారులకి ఖచ్చితమైన సమాధానం తెలుపుతూ సరియైన విధానంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకి సూచించారు. ప్రజావాణిలో భూ సమస్యలకి సంబంధించి 38 దరఖాస్తులు, వివిధ ఎంపిడిఓ లకి 36 దరఖాస్తులు, మున్సిపల్ కమిషనర్లకి 8,పంచాయతీ రాజ్ శాఖ కి (డి పి ఓ )7,మిగిలిన 9 వివిధ శాఖలకి సంబందించి వచ్చాయని మొత్తం 97 దరఖాస్తులు వచ్చాయని ఆర్జిలను పరిష్కరించాటానికి సంబంధిత అధికారులకు పంపటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, డి పి ఓ యాదగిరి, డి డబ్ల్యూ ఓ నరసింహారావు,సీపీ ఓ కిషన్, డి ఈ ఓ అశోక్, డి యమ్ హెచ్ ఓ కోటాచలం, డి ఎ ఓ శ్రీధర్ రెడ్డి,వెల్పేర్ అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పరిపాలన ధికారి సుదర్శన్ రెడ్డి, సుపారీటిడెంట్లు సాయిగౌడ్, శ్రీనివాస రాజ్, శ్రీనివాస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -