Thursday, February 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన పిఏసిఎస్ ఇప్ప చైర్మన్ మొండయ్య

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన పిఏసిఎస్ ఇప్ప చైర్మన్ మొండయ్య

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొoడయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఒక స్టాపర్, ఒక ఏఎమ్మార్ సిబ్బంది మాత్రమే ఉండడం,ఆసుపత్రి అపరిశుభ్రంగా ఉండడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.వైద్యాశాఖ ఉన్నతాధికారులు 24 గంటలు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నట్లుగా చెప్పడమే తప్పా ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ప్లేట్ లెట్స్ పరీక్షల కోసం రోగులు వస్తుంటే లిక్విడ్ లేదంటూ సిబ్బంది కుంటి చెబుతున్నట్లుగా వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -