నవతెలంగాణ – ఉప్పునుంతల : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు జైపాల్ రెడ్డి తండ్రి కీర్తిశేషులు వెల్దండ రామచంద్ర రెడ్డి దశదినకర్మ కార్యక్రమం ఉప్పునుంతల మండలం తిరుమలపూర్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మల్కాజ్గిరి కాంగ్రెస్ ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావు, ముఖ్యమంత్రి సోదరుడు కృష్ణారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ రామచంద్ర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రామచంద్ర రెడ్డి దశదినకర్మలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమారు పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES