Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి...

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి…

- Advertisement -
  • – జిల్లా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు…
  • నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ప్రజావాణి లో వచ్చిన అర్జీలకు    సత్వర పరిష్కారం కోసం  చర్యలు చేపట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 49 అర్జీలను, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  భాస్కర్ రావు కలసి  అర్జీలను స్వీకరించారు. సంబంధిత అధికారులు దరఖాస్తులను పెండింగ్ లేకుండాఎప్పటికప్పుడ పరిశీలించి పరిష్కరించాలన్నారు.
  • అందులో రెవిన్యూ శాఖ 40 జిల్లా పంచాయతీ శాఖ 4 ,   సంక్షేమశాఖ,మున్సిపాలిటీ ,  విద్యా, సర్వే ల్యాండ్స్ , లీడ్ బ్యాంకు శాఖలకు ఒక్కొకటి చొప్పున  వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పిడి విజయ సింగ్,వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -