Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఆపరేషన్‌ కగార్‌ పేరుతో కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వాలు

ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వాలు

- Advertisement -

ఏజెన్సీ ప్రజల సౌకర్యం కోసం రూ.100కోట్లు కేటాయించరా..? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ములుగు జిల్లాలో సీపీఐ(ఎం) పాదయాత్ర ముగింపు సభ

నవతెలంగాణ -వెంకటాపురం
ఆపరేషన్‌ కగార్‌ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా హెలికాప్టర్లు, 35 వేల మంది సైన్యంతో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలోని గిరిజనుల రవాణా సౌకర్యం కోసం వంద కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ములుగు జిల్లా యాకన్నగూడెం నుంచి వెంకటాపురం వరకు అధ్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం వెంకటాపురం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ పాదయాత్ర యాకన్నగూడెం నుంచి వెంకటాపురం వరకు 32 కిలోమీటర్లు సాగింది. అనంతరం అంబేద్కర్‌ సెంటర్‌లో మండల కార్యదర్శి గ్యానం వాసు అధ్యక్షతన జరిగిన పాదయాత్ర ముగింపు సభలో జూలకంటి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక దోపిడీపై ఉన్న ఆసక్తి గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై లేదన్నారు. ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ములుగు జిల్లా వెంకటాపురం వరకు ఉన్న 100 కిలోమీటర్ల రహదారిపై ప్రతినిత్యం 50, 60 టన్నులపైగా బరువుతో వందలాది లారీలు ప్రయాణం చేస్తుంటాయని తెలిపారు. వాటి అధిక బరువు వల్ల రహదారి అధ్వానంగా తయారయిందన్నారు. గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు, ఆటోవాలాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. ఏజెన్సీలోని ఇసుక రవాణా ద్వారా ప్రభుత్వానికి ప్రతిరోజూ కోటికి పైగానే ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఇంత ఆదాయం వస్తున్నా రోడ్డు మరమ్మత్తుల కోసం నిధులు కేటాయించక పోవడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు.. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉంటే భద్రాద్రి అభివృద్ధి సాధ్యం కాదని కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొని ఏజెన్సీ ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాలో ఉన్న 65 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆ జిల్లా పార్టీ ఉద్యమాలు చేస్తుందన్నారు. ములుగు జిల్లాలో ఉన్న 32 కి.మీ రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లు కేటాయించాలని పాదయాత్ర చేసినట్టు చెప్పారు. రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని పోరాటాలు చేస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎంపీ బలరాం నాయక్‌, మంత్రి సీతక్క ఏం చేస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతున్న పోరాటాన్ని రోడ్డు భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

గ్రామస్తులకు కృతజ్ఞతలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి వెంకటా పురం గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్ల మరమ్మతులు పట్టని ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో గత నెలలో వెంకటాపురం బంద్‌కు పిలుపునిస్తే గ్రామ వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దుకాణాలను మూసివేసి పోరాటానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. రాజకీయాలకు అతీతం గా తమ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలో వంద లాది మంది గ్రామస్తులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్ర మంలో ములుగు జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి శ్రీను, వంకా రాములు, చారి, జజ్జరి దామోదర్‌, సాధనపల్లి దేవమణి, పరిశిక రాంబాబు, మాణిక్యం, తోట నాగేశ్వరావు, శ్రీను పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad