Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసందర్శకులకు సకల సౌకర్యాల కల్పన

సందర్శకులకు సకల సౌకర్యాల కల్పన

- Advertisement -

మేడారం జాతరపై సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి
రూ.150 కోట్లతో సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాట్లు
దేవుళ్ళ వద్ద రాజకీయం చేసిన నాయకులు ఎవరూ ఎదగలేదు :మంత్రి ధనసరి అనసూయ సీతక్క

నవతెలంగాణ – ములుగు
వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని సందర్శకులకు సకల సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. మేడారంలో జరుగునున్న పనులను పరిశీలించడానికి వారంలోగా ముఖ్యమంత్రి మేడారాన్ని పర్యటిస్తారని తెలిపారు. మంగళవారం ములుగు జిల్లా తాడ్వాయి(ఎస్‌ఎస్‌) మండలం మేడారం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వీఐపీ పార్కింగ్‌ రోడ్డు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, హరిత హౌటల్‌ తదితర ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఎస్పీ డాక్టర్‌ శబరిష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ బానోతు రవిచంద్రతో కలసి మంత్రి పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశం హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర-2026పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.150 కోట్లు కేటాయించిందని, ఆయా శాఖల అధికారులు 100 రోజుల నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంతంలో పూజారుల మనోభావాలు దెబ్బ తినకుండా వారి సూచనల మేరకు నూతన హంగులతో శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు చేయాలని తెలిపారు. మేడారం గ్రామస్తులు, పూజార్ల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర పండుగగానే కాకుండా మరో కుంభమేళా తరహాలో జరగనున్న జాతరకు సామాన్య పౌరుని నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నదని అన్నారు. వీఐపీలకు ఇబ్బందులు రాకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈసారి చేపట్టనున్న పనులు శాశ్వతంగా ఉండే విధంగా నాణ్యతగా జరిగేలా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వనదేవతల ప్రాంతంలో రాజకీయాలు చేసే ఏ రాజకీయ నాయకుడు ఎదగలేదని, రానున్న మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ స్థపతి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఈ శివనాగిరెడ్డి, అదనపు కలెక్టర్‌ సీహెచ్‌ మహేందర్‌ జి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఈఓ వీరస్వామి, ఆర్కిటెక్చర్‌, ఇంజినీరింగ్‌ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad