Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంజార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు భట్టి పరామర్శ

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌కు భట్టి పరామర్శ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జార్ఖండ్‌ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను పరామర్శించారు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) వ్యవస్థాపకులు, మాజీ సీఎం శిబూ సోరెన్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శిబూసోరెన్‌ మృతి పట్ల భట్టి తన సంతాపాన్ని ప్రకటించారు. బుధవారం జార్ఖండ్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. తెలంగాణ, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా భట్టి అక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హేమంత్‌ సోరెన్‌తో కలిసి పని చేశారు. జేఎంఎం, కాంగ్రెస్‌ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో భట్టి విక్రమార్క కీలక భూమిక పోషించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad