ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్
తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ (టీయూజేఏసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని ప్రొఫెసర్ కోదండరాం, హరగోపాల్ అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ (టీయూజేఏసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. జేఏసీ చైర్మెన్ సుల్తాన్ యాదగిరి అధ్యక్షతన నిర్వమించిన ఈ ధర్నాలో కోదండరాం మాట్లాడుతూ.. ప్రజాస్వామిక తెలంగాణ సాధనలో భాగంగానే ఉద్యమకారులకు రావలసిన హక్కులను సాధించుకునే దిశగా ఉద్యమకారులు మరో ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యమకారులు రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రం సిద్ధించిందని, ఏర్పడిన తెలంగాణలో ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు దక్కాలని తెలిపారు. ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ..అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని, ఉద్యమ కారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ కారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. 250 గజాల స్థలం ఇచ్చి వారికి అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి చైర్మెన్ వెన్నెల గద్దర్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, గద్దర్ కుమారుడు సూర్యం, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్, ఓయూ జేఏసీ నాయకులు మాందాల భాస్కర్, టీవీయూవీ అధ్యక్షులు కంచర్ల భద్రి, తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుండా యాదగిరి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES