- Advertisement -
నవతెలంగాణ-గాంధారి: గాంధారి మండలంలోని ఏస్జీఎఫ్ క్రీడాల ఎంపిక పోటీలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగంలో మంగళవారం నిర్వహిస్తున్నట్లు మండల విద్య శాఖ అధికారి శ్రీహరి,వ్యాయామ ఉపాధ్యాయుడిగా లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. అండర్-14, అండర్-17 విభాగంలో కబడ్డి, వాలీబాల్, ఖో-ఖో బాల బాలికలకు జోనల్ స్థాయిలో ఎంపిక నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రతి క్రీడల్లో ముగ్గురు నైపుణ్యం కలిగిన క్రీడాకారులు పోటీలకు హాజరు కావాలని అయన సూచించారు. బోనఫైడ్, వెంట తెచ్చుకోవాలన్నారు, త్వరలో జిల్లా స్తాయి క్రీడల షెడ్యూల్ రానుండటం తో ఎంపిక నిర్వహిస్తున్నామన్నారు
- Advertisement -