- Advertisement -
నవతెలంగాణ – నిజాంసాగర్: బిజెపి డిస్టిక్ కౌన్సిల్ మెంబర్ గా మండలంలోని ఆరేడు గ్రామానికి చెందిన నాయకుడు బోయిని సాయిలు ను జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు నియమించారు. ఈ సందర్భంగా బోయిన సాయిలు మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో జిల్లాస్థాయి బాధ్యతను ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, మాజీ అధ్యక్షురాలు అరుణతార, మాజీ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఆయన తెలిపారు.గతంలో బోయిని సాయిలు నిజాంసాగర్ బిజెపి మండల అధ్యక్షునిగా పనిచేశారు.
- Advertisement -