- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా పూర్వ కలెక్టర్ చక్రపాణి ( 1992 -1995 ) నిజామాబాద్ వచ్చిన సందర్భంగా, వారిని గురువారం బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఆఫీస్ గెస్ట్ హౌస్ లో శాలువా పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఆయన సమయంలో 1992-95 జిల్లా లో విద్య లో న్యాయమైన విద్యకై అనేక సంస్కరణలు అమలు చేశారు. ముఖ్యంగా పదవ తరగతి పై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఆ సమయంలో 10 వ తరగతి చదివిన విద్యార్థులు ఇప్పటికి ఆయన ను గుర్తుంచుకుంటారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్షి రాఘవాపురం గోపాలకృష్ణ, అసోసియేటడ్ అధ్యక్షులు ఎ మోహన్, గౌరవ సలహాదారులు రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -