నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని నందిగాం గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తుడు పడాల రవీందర్ గౌడ్ కు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఈసీ సభ్యునిగా ఎన్నిక కావడంతో జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్, రాష్ట్ర అధ్యక్షులు టివి పుల్లంరాజు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పడాల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్తులో సంఘ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తనపై నమ్మకంతో అదిలాబాద్ జిల్లాను ఇన్చార్జిగా ఇచ్చినందుకు జాతీయ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగం రమేష్, రాష్ట్ర ఈసీ మెంబర్ పుట్టి కృష్ణ, రచ్చ ఆదినాథ్, ఈసీ మెంబర్ చల్ల నగేష్, నిఖిలేష్ మరియు భక్తులు పాల్గొన్నారు.
పడాల రవీందర్ గౌడ్ కు సత్కారం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES