త్రినాధ్ కఠారి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్కి ‘ఇట్లు మీ ఎధవ’ అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. ‘వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు’ అనేది ట్యాగ్ లైన్. తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ను డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘గ్లింప్స్ చాలా బావుంది. చాలా ఫన్నీగా ఉంది. ప్రతి అబ్బాయికి ఈ టైటిల్ చిన్నప్పటి నుంచి కెరీర్లో సెటిల్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలాంటి టైటిల్ పెట్టారు (నవ్వుతూ). ఇది మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్’ అని అన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్ వర్క్లో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, మధుమణి, సురభి ప్రభావతి, తాగుబోతు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకులు ఆర్.పి. పట్నాయక్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ సాధించిన జగదీష్ చీకటి డీవోపీగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: త్రినాధ్ కఠారి, నిర్మాత: బళ్లారి శంకర్, ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి., ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్, లైన్ ప్రొడ్యూసర్: బృంధావన్ కేతిరెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్: బృందావర్ధని అవ్వారు.