- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులకు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సైన్య సేన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రర్ల నరేష్ పేపర్లో కథనం చూశాక వెంటనే సైన్యసేన ఆధ్వర్యంలో ప్రయాణికులకు తగు నీరు ఏర్పాటు చేయడం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేయవలసింది స్వచ్ఛంద సంస్థ వారు చేశారు.
గత కొద్ది రోజులుగా కామారెడ్డి కొత్త బస్టాండులో తాగునీరు అందుబాటులో లేక కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చే జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చే ప్రజల సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిని గమనించిన నిర్వాహకులు మంగళవారం తాగునీటి సౌకర్యం కల్పించారు.
- Advertisement -