- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్ముకశ్మీర్లో నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలతో పాటు పంజాబ్లో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జమ్ముకశ్మీర్లో ఖాళీగా ఉన్న నాలుగు స్థానాలకు మూడు వేర్వేరు ఎన్నికలు జరుగుతాయి. ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం, వేర్వేరు కేటగిరీలకు చెందిన ఖాళీ స్థానాలకు విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలి. అక్టోబర్ 24న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు.
- Advertisement -