- Advertisement -
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శనివారం దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. మహాలక్ష్మి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దంపతులు అందరూ అమ్మవారికి 41 రకాల ప్రసాదాలను నివేదించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ గ్రామ ప్రజలు భవాని మాల ధారణ వేసుకున్న భవానీలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
- Advertisement -