Saturday, October 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుదుర్గామాత నిమ‌జ్జ‌నంలో అప‌శృతి

దుర్గామాత నిమ‌జ్జ‌నంలో అప‌శృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. సరూర్ నగర్ చెరువులో దుర్గమ్మను నిమజ్జనం చేస్తుండగా భారీ క్రేన్ అమాంతం గాల్లోకి లేచి పల్టీ కొట్టింది. అయితే ఆది చెరువులో పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదే రోడ్డు వైపు పడితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. అనువభం లేని కంపెనీకి నిమజ్జనం బాధ్యతలు అప్పజ‌ప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. 43 శాతం తక్కువ మొత్తానికి కోట్‌ చేయడంతో సిటీ క్రేన్‌ సర్వీసెస్‌కు నిజమజ్జనం టెండర్‌ను జీహెచ్‌ఎంసీ కేటాయించింది. అయితే అనుభవంతోపాటు మెయింటేనెన్స్‌ కూడా సరిగా లేకపోవడంతోనే ఈ ఘటన జరిందని చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -