Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయందగ్గు మందుతో 10 మంది చిన్నారులు మృతి..డాక్టర్‌ అరెస్టు

దగ్గు మందుతో 10 మంది చిన్నారులు మృతి..డాక్టర్‌ అరెస్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో దగ్గు మందు తీసుకొన్న 10 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దగ్గు సిరప్‌ను సూచించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.

ఆదివారం తెల్లవారుజామున డాక్టర్‌ను అదుపులోకి తీసుకొన్నామని పోలీసులు తెలిపారు. బాధిత చిన్నారుల్లో చాలా మందికి ఈయనే దగ్గు మందును సూచించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు సిరప్‌ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్‌ ఫార్మా యూనిట్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కంపెనీ తయారు చేసిన దగ్గు మందును తనిఖీ చేయగా అందులో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉందని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కంపెనీపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -