ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పెద్దవంగర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై మంగళవారం ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా అన్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు.
ప్రతి గ్రామంలో బూత్ కమిటీలను బలోపేతం చేసి, స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వెల్లడించారు. భారీ మెజార్టీ ఏ లక్ష్యంగా నాయకులు అందరూ కలిసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, సీనియర్ నాయకులు నెహ్రూ నాయక్, ప్రవీణ్ రావు, మండల ఇంచార్జి విజయ్ పాల్ రెడ్డి, మండల నాయకులు మురళి, సతీష్, సైదులు, రవీందర్ రెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాస్, మధన్ మోహన్ రెడ్డి, వేణు, దేవేంద్ర, హరికృష్ణ, రాజు, వెంకన్న, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పని చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES