- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ప్రయివేటు పాఠశాల బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకుపోయింది. వల్లభాపురం పాఠశాలకు చెందిన బస్సు 15 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన వాహనానికి తప్పించుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. చెరువు కట్టపై ఉన్న చెట్లను ఢీకొని బస్సు ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. బస్సుకు సరైన ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- Advertisement -