భార్యను గాయపరిచిన భర్త పై కేసు నమోదు

నవతెలంగాణ – అశ్వారావుపేట 
భార్యను వేధింపులకు గురి చేస్తూ, దాడికి పాల్పడిన భర్త పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక ఏ.ఎస్.ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఏపీ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కాచారం గ్రామానికి చెందిన కాకాని నవ్యకు, ఇదే గ్రామానికి చెందిన కాకాని నాగేంద్రరావు కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. కాగా కొంతకాలం క్రితం జీవనోపాధి కొరకు అశ్వారావుపేట మండలంలోని భీముని గూడెం వచ్చి ఓ రైతు తోటలో మకాం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా భర్త నాగేంద్రరావు భార్య నవ్య పై అనుమానంతో శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నవ్య తల, చేతులపై దాడికి పాల్పడటంతో గాయాలైయ్యాయి. దీంతో బాధితురాలు మంగళవారం వేధింపులకు గురి చేస్తున్న భర్తపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.
Spread the love