నవతెలంగాణ-హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఎంఎస్ఎన్ రెండో యూనిట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టోరేజీ విభాగంలో రసాయన డ్రమ్ములు నిల్వ ఉంచడంతో అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం సంభవించింది. రసాయన డ్రమ్ములు పేలడంతో మంటలు దావానంలా వ్యాపించాయి. ఆరు అగ్నిమాపక శకటాలతో మంటలార్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్టోర్లో ఎంతమంది కార్మికులు ఉన్నారనేదానిపై ఇంక స్పష్టత రాలేదు. రసాయన డ్రమ్ములు పేలుతుండటంతో మంటలు అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బంది కష్టతరంగా మారింది.