హేమంత్‌ సోరెన్‌కు భారీ ఊరట..

నవతెలంగాణ – హైదరాబాద్: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు జార్ఖండ్‌ హైకోర్టు  తాజాగా బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో రాంచీలోని బిర్సా ముండా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆయన హైకోర్టు తీర్పుతో ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు రానున్నారు. జార్ఖండ్‌ ముఖ్యంమత్రిగా ఉన్న హేమంత్‌ సోరెన్‌ను భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జనవరి 31న అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సొరేన్‌ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న ఆయన దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు బెయిల్‌పై బయటకు రాబోతున్నారు.

Spread the love