ఆర్టీసీ కీలక నిర్ణయం.. సెలవులు రద్దు

నవతెలంగాణ హైదరాబాద్: నేడు కార్తీక మాసం చివరి వారం కావడంతో రద్దీ పెరిగే అవకాశమున్న దృష్ట్యా ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు ప్రయాణికుల రద్ధీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను టీఎస్ఆర్టీసీ రద్దు చేసింది. ఉచిత ప్రయాణాల నేపథ్యంలో గత ఆదివారంతో పోలిస్తే నిన్న దాదాపు 15 శాతం రద్దీ పెరిగినట్టు ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు.

Spread the love