నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్తో మాట్లాడి పనుల బంద్ నిర్ణయాన్ని ఉపసంహరింపజేసి పనులు పున:ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్క్ టు ఓనర్ పథకాన్ని త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆయన గురువారం లేఖ రాశారు. పెండింగ్లో ఉన్న 2022-23 యారన్ సబ్సిడీని కార్మికుల ఖాతాలో వేయాలని కోరారు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్స్పైన బతుకుతూ జీవనం గడుపుతున్నారని తెలిపారు. బతుకమ్మ, తదితర ప్రభుత్వ పథకాలకు కావాల్సిన వస్త్రాలను సిరిసిల్ల పవర్లూమ్ కార్మికుల ద్వారానే తయారవుతున్నదని పేర్కొన్నారు.