సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న రామారెడ్డి వాసి

నవతెలంగాణ- రామారెడ్డి
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని బ్యాంకు ఖాతా నుండి నగదు పోగొట్టుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన యాగల నాగరాజు కు 93 11 0 59 0 42 చరవాణి నుండి ఎల్ఐసి పాలసీ నుండి బోనస్ డబ్బులు రూ, 19000 ఫోన్ పే కు పంపిస్తామని, ఓ నెంబర్ను పంపిస్తాను, ఫోన్ పే లో నమోదు చేయాలని సూచించగా, ఆయన నమోదు చేయగానే, ఖాతాలో నుండి నాలుగు దాపలుగా రూ, 98,250 సైబర్ నేరగాళ్లు విత్ డ్రా చేశారని, బాధితుడు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామని ఏ ఎస్ ఐ సుభాషిని తెలిపారు.

Spread the love