పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ – బొమ్మలరామారం
జలాల్ పూర్ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల 2003-04 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మండలంలోని రామలింగంపల్లి గ్రామంలోని రామలింగేశ్వర ఫంక్షన్ హల్లో ఘనంగా జరుపుకున్నారు.తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ప్రతాప్ రెడ్డి,ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి, భాస్కర్, వెంకట్ రాజు, స్వరాజ్యం, మిత్రులు తాళ్ల రవీందర్ రెడ్డి, మోటూరి పాండు, బాలకృష్ణ, రమేష్ యాదవ్, సురేష్ గౌడ్, గురు ప్రసాద్, రమేష్ నాయక్, గణేష్ రెడ్డి, కృష్ణ, లక్ష్మణ్,రాణి, మిత్రులు పాల్గొన్నారు.
Spread the love