రైల్వే ట్రాక్ దగ్గర గుర్తుతెలియని ఆడ మనిషి శవం లభ్యం

నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్ స్టేషన్ పరిధిలో గల పాంగ్ర శివారులో గల రైల్వేపట్టాల వెంబడి కాలువ పక్కన ఒక గుర్తుతేలియని ఆడ మనిషి శవం లభ్యమైనట్లు నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజీవ్ మంగళవారం తెలిపారు. ఆమె వయస్సు అందాజ 55- 60 సంవత్సరాలు వయస్సు ఉంటుందన్నారు. ఆమె వెంట్రుకలు తెలుపు రంగులో కలవు. ఆమె శరీరం పై గులాభి రంగు చీర ముదురు నీలం రంగు గల జాకెట్ కలవు. మృతురాలి సమీపం లో ఆమె తంబాకు సంచి కలదు. అందులో సున్నం డబ్బా, తంబాకు, ఒక పోకల కత్తెర, జండుబామ్ కలవు. మృతురాలు మహారాష్టకు చెందినా వ్యక్తి  అయి ఉండవచ్చని, సుమారు 5-10 రోజుల మద్య రైలు లో నుంచి పడి గాయాలై మరణించి ఉండవచని పైకి కనబడుతుంది. కావున పైన తెలిపిన పోలికలతో ఎవరైన తప్పిపోయి ఉంటె స్టేషన్ హౌస్ ఆఫీసర్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్, నిజామాబాద్ (8712659840, 8712659719) యందు సంప్రదించగలరు అని తెలియజేశారు.
Spread the love