చేవెళ్ల సభకు ర్యాలిని ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

నవతెలంగాణ – కంటేశ్వర్
పటాన్చెరువు నుండి చేవెళ్ల సభకు ర్యాలీని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ మేరకు  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్  ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న చేవెళ్ల దళిత గిరిజన ప్రజా గర్జన సభకు పటాన్ చెరువు నుండి వెళ్తున్నా వాహనాలను జెండా ఊపి ర్యాలీ  నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పటాన్ చెరువు జన సమీకరణ ఇంచార్జ్ మానాల మోహన్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు నియోజకవర్గ ఇంఛార్జి శ్రీనివాస్ గౌడ్, నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు,నిజామాబాద్ ఎన్ ఎస్ యు ఐ అద్యక్షులు వేణు రాజ్, అశ్రఫ్,పటాన్ చెరువు నియోజకవర్గ పరిధి మున్సిపల్ నాయకులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love