నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్మార్కెట్ సూచీలు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్, ఐటీసీ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. నిఫ్టీ 22 వేల స్థాయి ఎగువన ముగిసింది.