కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం: జైషా

నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్‌ జట్టుకు కొత్త కోచ్‌ వస్తున్నారా..? బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా వెల్లడించిన సమాచారం ప్రకారం నిజమేనంటున్నాయి క్రికెట్‌ వర్గాలు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ను టీ20 ప్రపంచ కప్‌ వరకు కొనసాగాలని బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది. జూన్ 1 నుంచి పొట్టి కప్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ ముగిసే వరకూ అతడే కోచ్‌గా ఉంటాడు. ఇప్పటికే ఒకసారి పొడిగించగా.. మళ్లీ కొనసాగడానికి ద్రవిడ్‌ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో కొత్త కోచ్‌ కోసం ప్రకటన ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది.‘‘రాహుల్ పదవీ కాలం జూన్‌ వరకే ఉంది. ఒకవేళ అతడు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. చేసుకోవచ్చని జైషా తెలిపారు.

Spread the love