నవతెలంగాణ – జుక్కల్
మమడల కేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాలలో నోబ్యాగ్ డేను నిర్వహించామని ప్రదాన ఉపాద్యాయుడు బస్వంత్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా హెచ్ఎం బస్వంత్ మాట్లాడుతు శనివారం నాడు పాఠశాలలోని ఉపాద్యాయులు విద్యార్థులకు చంద్రయాన్ 3 గురించి వివరించి నమూనా చిత్రాలను ముగ్గురూపంలో విద్యార్థిని విద్యార్థుల చేత వేయించారు.అనంతరం విద్యార్థులతో ఆటలాడించారు. డిజిటల్ స్క్రీన్ పైన స్పేస్ చిత్రాలను చూపించి సైన్స్ ఉపాద్యాయులు వివరించడం జర్గింది , కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాద్యాయులు పండరి, మనోహర్, ఉపాద్యాయ బృందం తదితరులు పాల్గోన్నారు.