గూడ్స్ రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి 

నవతెలంగాణ –  కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జాన్కంపేట్ రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి మంగళవారం తెలిపారు. రైల్వే ఎస్సై సాయి సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి వయస్సు అందాజా 40-45 సంవత్సరాలు జనకంపేట- బోధన్ రైల్వే స్టేషన్ ల మధ్యనా గల జనకoపేట రైల్వే గేటు దగ్గర గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అతనికి రక్త గాయాలు కాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రైల్వే పోలీసులు తరలించారు. అప్పటికే పరిక్షించిన వైద్యులు గూడ్స్ రైలు ఢీకొనడంతో చనిపోయాడు అని తెలియజేశారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు నిజమబాదు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలియజేశారు. మిగతా వివరాల కొరకు 8712658591 నంబర్కు సంప్రదించాలన్నారు. అదేవిధంగా మృతుని వివరాలు తెలిస్తే రైల్వే హెడ్ కానిస్టేబుల్ హన్మంలు 9440999341 కు సంప్రదించాలని రైల్వే ఎస్సై పేర్కొన్నారు.
Spread the love