మాజీ మహిళా రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్‌ సీఈఓ

 

నవతెలంగాణ – హైదరాబాద్: టెక్‌ బిలియనీర్‌, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈఓ అంకుర్ జైన్ వరల్డ్ రెజ్లింగ్‌ (WWE) ఎంటర్‌టైన్‌మెంట్ మాజీ మహిళా రెజ్లర్‌ ఎరికా హమ్మండ్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈజిప్టులో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఏప్రిల్‌ 26నే వివాహం జరగ్గా.. పెళ్లి ఫొటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘మా జీవితాల్లో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. అందుకు ఎక్కువ ఖర్చు లేకుండా సాధారణంగా వివాహం చేసుకున్నాం. డెకరేషన్ల కోసం వేల డాలర్లు ఖర్చు చేయడం ఎందుకు? ప్రపంచంలోనే భిన్నమైన వాతావరణంలో వేడుక చేసుకోవడం కొత్త అనుభూతినిస్తోంది’’ అని అంకుర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Spread the love