నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ను సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. ఈ మ్యాచ్కు ఎస్ఆర్హెచ్ హౌం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ టీమ్ ఇవాళ హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్లో ల్యాండ్ కాగానే హిట్మ్యాన్కు ఘన స్వాగతం లభించింది. రోహిత్ హైదారాబాద్లో ల్యాండైన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా వైరలవుతుంది. సన్రైజర్స్తో ముంబై మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. కాగా, ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే.