ట్రాక్టర్ బొల్తా మహిళ మృతి.

నవతెలంగాణ  – జుక్కల్

బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సుమారు 20 మంది ఒడ్డేర కులస్తులు శుక్రవారం కౌలాస్ ఎల్లమ్మ దర్శనానికి వెళ్లారు. సాయంత్రం గ్రామానికి వెళుతున్న సమయంలో జుక్కల్ చౌరస్తా వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ద్యారండ్ల అంజలి (11) మృతి చెందారు. నాలుగురికి తీవ్రగాయాలు, మిగితా వారికీ స్వల్పగాయాలు అయ్యాయి. 108 లో బిచ్కుంద ఆసుపత్రికి పంపించారు. తండ్రి గురు ఫిర్యాదు మేరకు జుక్కల్ ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అదే దారిలో వెళ్తున్న పెద్ద కొడప్గల్ ఎస్సై కోనారెడ్డి సంఘటన స్థలంలో ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Spread the love