ఆధార్‌ అప్‌డేట్‌: మరోసారి గడువు పొడిగింపు

నవతెలంగాణ – హైదరాబాద్: ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. దీంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 2024 జూన్‌ 14తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్‌ 14 వరకు పెంచింది. దీంతో ఆధార్‌ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి.

Spread the love