ఆప్ మంత్రి అతిశీ ఆస్పత్రికి తరలింపు

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ నీటి సంక్షోభంపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆప్ మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీక్ష ఐదో రోజుకు చేరడంతో ఆమెకు షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె 3 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. కాగా హరియాణా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను వెంటనే విడుదల చేయాలని అతిశీ దీక్ష చేపట్టారు.

Spread the love