సింగరేణి జీడీకే-11 గనిలో ప్రమాదం.. ఒకరు మృతి

నవతెలంగాణ – హైదరాబాద్ : సింగరేణి జీడీకే-11 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బొగ్గును వెలికితీసే మిషన్ ఢీకొని ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ ప్రతాప్‌కు తీవ్ర గాయలయ్యాయి. గమనించిన సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలిద్దామనే లోపే ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సింగరేణి ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే, మృతుడు ప్రతాప్ స్వస్థలం రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన వాడని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Spread the love