వరి ధాన్యాన్ని పరిశీలించిన ఏఈఓ రాకేష్

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో మంగళవారం ఏఈఓ రాకేష్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వరి ధాన్యాన్ని తడవకుండా తాటిపత్రిలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తడిసిన వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా కల్పించారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love