మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి: జడ్పీ ఛైర్మన్

నవతెలంగాణ – మల్హర్ రావు
ఉపాధి హామీ పనికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందిన  అక్కపాక లక్ష్మి అనే ఉపాధిహామీ కూలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పుట్ట మాట్లాడారు మంథని మండలంలోని విలోచవరం గ్రామానికి చెందిన అక్కపాక లక్ష్మి మంగళవారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు వెళ్ళి వడదెబ్బ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని, సమాచారం అందుకున్న తాను హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి. ఉపాధి కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందిన లక్ష్మీ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరారు.
Spread the love