తాడిచెర్లలో చలివేంద్రం ప్రారంభం

నవతెలంగాణ – మల్హర్ రావు
వేసవిలో ఎండలు భగభగ మండుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి మండల ప్రత్యేక అధికారి అవినాష్ ఆదేశాల మేరకు మండల ఎంపీడీఓ కే. శ్యాంసుందర్ మండల కేంద్రమైన తాడిచెర్లలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించినట్లుగా  పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్  తెలిపారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడారు వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా, గ్రామ ప్రజల సౌకర్యార్థం ,ప్రయాణికుల కోసం, బస్టాండ్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రజలు,ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love