బాధిత కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ

నవతెలంగాణ – మల్హర్ రావు
మహాదేవపూర్ మండల కాంగ్రెస్  మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అస్రార్ ఖురేష్ తండ్రి  అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం పార్థివ దేహానికి  ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం బాధిత  కుటుంబాన్ని పరామర్శించి, అధైర్య పడొద్దు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love