అమ్మ ఆదర్శ పాఠశాలను పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని పోసానిపేట్, రామారెడ్డి అమ్మ ఆదర్శ మండల పరిషత్ పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులపై పలు సూచనలు చేశారు. పాఠశాల ప్రారంభించినటికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సౌకర్యవంతమైన పాఠశాలగా ఏర్పాటు చేయాలని, పనులు నాణ్యతతో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యోసేపు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఆనంద్, డి ఈ శాలిని, ఏఈ సంతోష్, ప్రధానోపాధ్యాయులు మురళి, బ్రహ్మం, ప్రవళిక, దేవుల, వివో లు, సి ఆర్ పి మహమ్మద్ తదితరులు ఉన్నారు.
Spread the love